18లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి
By Vijayawada TownHub
5:40:00 am
Jobs
18లోపు
పరీక్ష ఫీజు చెల్లించాలి
మార్చి 2017లో నిర్వహించే పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు
షెడ్యూల్ను జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారెడ్డి శుక్రవారం విడుదల చేశారు.
రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.125ను నవంబరు 18వ తేదీలోపు చెల్లించాలన్నారు.
రూ.50 అపరాధ రుసుంతో డిసెంబరు 3వ తేదీలోపు, రూ.200 అపరాధ
రుసుంతో డిసెంబరు 19వ తేదీలోపు, రూ.500 అపరాధ రుసుంతో 2017 జనవరి
3వ తేదీలోపు చెల్లించాలని చెప్పారు. ఒకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ పరీక్షలకు
రూ.125కు అదనంగా మరో రూ.60 చెల్లించాలన్నారు. మూడు సబ్జెక్టుల
వరకు ఫెయిలైన వారు రూ.110, మూడుకు మించి ఫెయిలైన విద్యార్థులు
రూ.125 చెల్లించాలన్నారు. ఫీజును వేర్వేరు హెడ్ ఆఫ్ అకౌంట్లతో కూడిన
చలానా ద్వారా చెల్లించాలని సూచించారు. మొదటిసారి పబ్లిక్ పరీక్షలకు
హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం
పట్టణ ప్రాంతాల్లో రూ.24వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20వేలు మించకుంటే
సదరు విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. నిబంధనల
ప్రకారం తహసీల్దారుచే మంజూరు చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా
ఫీజు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
·
For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store.
0 thoughts on “18లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి”