• రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ధ్రువ’ సినిమా ఆడియో విడుదల వేడుకకు ప్రత్యేక అతిధిగా పవన్ కల్యాణ్ హాజరయ్యే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బాబాయ్ ను చరణ్ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసుకున్నాడని సమాచారం. ఇది వరకూ పవన్ చరణ్ హీరోగా నటించిన ‘నాయక్’ సినిమా ఆడియో విడుదలకు హాజరయ్యాడు. ఆ సినిమా హిట్టైంది. ఈ నేపథ్యంలో బాబాయ్ ను లక్కీ చార్మ్ గా భావిస్తూ.. చరణ్ ప్రత్యేకంగా ఆహ్వానించుకున్నాడని సమాచారం. నవంబర్ 20న ఆడియో విడుదల కానుంది.